Saturday, May 4, 2024

పోలీస్ శాఖలో క్రమశిక్షణ చాలా అవసరం: ఏసిపి నరేష్

మామునూరు డివిజన్ పోలీసులు వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఉత్తర్వుల మేరకు శుక్రవారం పరేడ్ నిర్వహించారు. పెరేడ్ లో పర్వతగిరి, అయినవోలు, సంగెం, మామునూరు, గీసుకొండ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు. పరేడ్ లో పాల్గొన్నపోలీస్ సిబ్బందిని ఉద్దేశించి ఏసిపి మామునూరు నరేష్ కుమార్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో క్రమశిక్షణ చాలా అవసరమని అన్నారు. డివిజన్లో ఉన్న పోలీసు అధికారులు అందరూ కమిషనర్  ఉత్తర్వులు పాటిస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందిస్తూ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చికోవాల్సి సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి  కమిషనర్ వరంగల్ చేతులమీదుగా ప్రశంసా పత్రాలు, క్యాష్ రివార్డ్ లు అందిస్తామన్నారు. మెరుగైన సేవలు అందిస్తూ వరంగల్ పోలీస్ రాష్ట్రంలోనే నెంబర్ వన్  స్థానంలో నిలిచే విధంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement