Sunday, April 28, 2024

Flash: ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు మహిళలు మృతి.. 10 మందికి తీవ్ర గాయాలు

కర్నూలు జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ,ఆటో ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. రుద్రవరం మండలం చిన్న కంబలూరుకు చెందిన 15 మంది మహిళలు మిరప తోటలో పనిచేసేందుకు పొరుగు గ్రామం వెళుతుండగా, ఆళ్లగడ్డ నుంచి రుద్రవరం వెళ్తున్న ఆర్టిసి బస్సు మెట్ట వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో చిన్న కంభలూరుకు చెందిన మేరమ్మ (30) జిలార్ బీ (35) అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో మరో 10 మంది గాయపడ్డారు. వీరిలో చాలా మందికి కాళ్లు చేతులు విరిగాయి. వీరిని మొదట ఆళ్లగడ్డ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో ఆరు మందిని కర్నూలు జి హెచ్ కి తరలించారు. సిరివెళ్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement