Monday, May 20, 2024

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

చిట్యాల : మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి శనివారం పాలాభిషేకం చేశారు.తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (కార్మిక విభాగం)905/2015 దుర్గం శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు, రెగ్యులర్ ఉద్యోగుల పిఆర్సి తో పాటు అన్ని విభాగాల అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అసెంబ్లీలో ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పట్ల జీతాలు పెంచే విషయంలో టిఆర్ఎస్కెవి రాష్ట్ర అధ్యక్షులు జి రాంబాబు యాదవ్ కృషి వెలకట్టలేనిది వారికి రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల మంతా రుణపడి ఉంటా మనీ యూనియన్ నాయకులు కట్కూరి నరేందర్ అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు .కిషోర్.స్వామి.రమణ.మీనాక్షి. పెర్సి.రాజేష్.కళ్యాణ్. శంకర్.కిరణ్. కిరణ్.శశి.రాజయ్య పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement