Wednesday, May 22, 2024

గొర్రెల కాపరులను రక్షించిన కొయ్యూరు పోలీసులు

మల్హర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం శాలపల్లి వద్ద వరద నీటిలో చిక్కుకున్న గొర్రెల కాపరులను ఆదివారం కొయ్యూరు పోలీసులు రక్షించారు. ఎస్సై సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని శాలపల్లి వద్ద ఉన్న రోడ్డు డౌన్ వద్ద ఇద్దరు వ్యక్తులు గొర్రెలతో చిక్కుకున్నట్లు డయల్ 100 ద్వారా కొయ్యూరు పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి ఎడ్లపల్లి గ్రామానికి చెందిన ముదిరాజ్ ల సాయంతో వారిని రక్షించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎవరూ బయటికి వెళ్లొద్దని సూచించారు. ఎలాంటి అత్యఅవసరం ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement