Wednesday, May 8, 2024

రోడ్డు ప్రమాదంలో జనగామ విలేఖరి మృతి..

జనగామ క్రైమ్ (ప్రభన్యూస్) : జనగామ పట్టణ ఆంధ్రజ్యోతి దినపత్రిక విలేఖరి పాషా (48) రోడ్డు ప్రమాదంలో మరణించారు. శనివారం జనగామ మండలం పెంబర్తి వద్ద జరిగిన ఈ ఘటనలో పాషా అక్కడి అక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఆదివారం జరగబోయే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) కవరేజ్ కోసం పెంబర్తి లోని అరబిందో బీఈడీ కళాశాలకు వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలిపారు.

హనుమకొండ – హైదరాబాద్ ప్రధాన రహదారి పై హనుమకొండ నుంచి హైదరాబాద్ కి వెళ్తున్న అశోక్ లేలాండ్ పెంబర్తి గ్రామం వద్ద రోడ్ దాటుతున్న రిపోర్టర్ వాహనాన్ని ఢీకొట్టింది..దీంతో పాషా రోడ్డుపై పడి మరణించారని తెలియజేశారు. ఈ సంఘటన పై జనగామ ఎస్ ఐ ప్రవీన్ కుమార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement