Tuesday, May 14, 2024

ఎమ్మెల్యే చల్లా సమక్షంలో… బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు

గీసుగొండ, జులై 5 (ప్రభ న్యూస్) : వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో పలువురు బీఆర్ ఎస్ లో చేరారు. బుధవారం గీసుగొండ మండలం విశ్వనాధపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు భూక్యా వెంకన్న, గుగులోత్ కమల్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోని ఆహ్వానించారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నారన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందుతుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను ప్రభుత్వం కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి గుండెల్లో కేసీఆర్‌ ఉంటారన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు మరి ఏ ఇతర రాష్ట్రాలలో అమలు కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండలాల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement