Sunday, April 28, 2024

మళ్లీ పెరుగుతున్న గోదావరి..

వాజేడు : గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తగ్గుముఖం పట్టిన గోదావరి మళ్లీ పెరుగుతూ ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు వద్ద 15 మీటర్లకు చేరుకుని దీనితో లోతట్టు గ్రామాలకు వరద నీరు చేరుకుంది. మండలంలోని పలుచోట్ల రహదారులు నీట మునగడంతో రవాణా సౌకర్యం స్తంభించి ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరదలు ఉధృతంగా మళ్లీ పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంత ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. రానున్న 24 గంటలు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement