Friday, May 3, 2024

TS: పదోన్నతులు ఇప్పించండి… మంత్రికి విన్నవించిన 2012 బ్యాచ్ ఎస్ఐలు

వరంగల్ (ఆంధ్ర ప్రభ) : తమ బ్యాచ్ కు చెందిన కొంతమంది ఎస్సీలకు మూడేళ్ల కిందట పదోన్నతి కల్పించారని, తమకు కూడా పదోన్నతులు కల్పించాలని 2012 బ్యాచ్ కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్లు రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు విన్నవించారు. ఇవాళ‌ మంత్రిని కలిసి 317 జీవో వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని విన్నవించారు.

తమ బ్యాచ్ కు చెందిన కొంతమందికి మూడేళ్ల కిందట పదోన్నతి లభించిందని, ఒకే బ్యాచ్ లో ఎంపికైన తమకు తీరని అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. పాత సీనియార్టీ ప్రకారం తమకు ఎస్ఐ నుండి ఇన్స్పెక్టర్ పదోన్నతి కల్పించాలని, తమకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల‌ని కోరారు. తమ సమస్య విన్న మంత్రి సానుకూలంగా స్పందించారని, 2012 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్లకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చినట్లు ఎస్సైలు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement