Monday, April 29, 2024

TS: రంగ‌నాధ స్వామిని ద‌ర్శించుకున్న త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్

హైద‌రాబాద్ : వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శనివారం కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని జియాగూడలో గల శ్రీ రంగనాధ స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామిని ఆయన దర్శించుకున్నారు.

పూజల అనంతరం ఆయనను ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో శంకర్ యాదవ్, ఆలయ చైర్మన్ తిరువెంగలా చార్యులు, ప్రధాన అర్చకులు శేషాచార్యులు, బద్రి చార్యులు, కార్పొరేటర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మిత్ర కృష్ణ, బంగారు ప్రకాష్, శేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement