Tuesday, April 30, 2024

గూడూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..

గూడూరు : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని నర్సంపేట రోడ్ లో ఉన్న పెట్రోల్ బంక్ ముందు లారీ, బైక్ ఢీకొట్టిన సంఘటనలో దన్నసరి లక్ష్మయ్య (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్ద‌రి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది. మహబూబాబాద్ జిల్లా గంగారాం మండల కేంద్రానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement