Saturday, May 4, 2024

విద్యుత్ షాక్ తో రైతు మృతి.. వరంగల్​ జిల్లాలో ఘటన

విద్యుత్ షాక్ తగిలి గిరిజన రైతు మృతి చెందిన ఘటన వరంగల్​ జిల్లాలో జరిగింది. చెన్నారావుపేట మండలం బోడ మాణిక్య తండాలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన బోడ సురేష్(32) కొద్దిపాటి వ్యవసాయంతో పాటు కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటాడన్నారు. రోజు మాదిరిగానే సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. సురేష్ ఆకస్మిక మృతితో తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి. భర్త మృత దేహం వద్ద భార్య రోదించిన తీరు పలువురికి కండతడి పెట్టించింది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement