Tuesday, May 7, 2024

రెచ్చిపోతున్న దోపిడీ దొంగలు.. భూపాలపల్లి లో రెండిళ్లలో చోరీ..

భూపాలపల్లి (ప్రభ న్యూస్) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. జవహర్ నగర్ కాలనీలో ఒకే రోజు రెండు ఇళ్ళలో చోరీకి పాల్పడి అందిన కాడికి దోచుకెళ్ళారు. స్థానికంగా నివాసం ఉంటున్న నర్సింగోజు శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో వివాహ వేడుకకు వెళ్లి వచ్చి చూసే సరికి బిరువ తాలలు పగల గొట్టి 30తులాల వెండి, 3గ్రాముల బంగారం, 5వేల నగదు ఎత్తుకెళ్లగా, అదే కాలనికి చెందిన నెరుపటి శ్రీనివాస్ ఇంట్లో లేని సమయంలో తులం నర బంగారం, 20వేల నగదును దొంగలు ఎత్తుకెళ్లడం తో బాధితులు లబోదిబోమంటు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement