Saturday, May 4, 2024

ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా ఎదగాలి : ఎమ్మెల్యే నరేందర్

ఖిలా వరంగల్ 37వ డివిజన్ దళితబంధు ద్వారా మంజూరైన యూనిట్లతో లబ్దిదారుడు బరిగల పూర్ణచందర్ తీసుకున్న టాటా ఏసీ ట్రక్ ని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం దళితబంధు.. ప్రతి దళిత కుంటుంబానికి అందించేవరకు పథకం కొనసాగుతుందని అన్నారు. ఈ పథకం ముఖ్య ఉద్దేశం ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్దానిక కార్పోరేటర్ బోగి సువర్ణ-సురేష్ ,మాజీ కార్పోరేటర్ బిళ్ళ శ్రీకాంత్,డివిజన్ అధ్యక్షులు సంగరబోయిన విజయ్,హర్షం రాంబాబు,శివమ్,హసిఫ్, ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement