Thursday, May 2, 2024

ఏసుక్రీస్తు జీవితం స్ఫూర్తిదాయకం..ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య

ప్రభన్యూస్ ప్రతినిధి, జనగామ : ప్రపంచ మానవాళికి ప్రేమతత్వం బోధించిన భగవాన్‌ ఏసుక్రీస్తు జీవితం స్ఫూర్తిదాయకమని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలోని ఎస్సి కాలనిలోని నిర్మలమాత‌ చర్చిలో ఘనంగా ఈస్టర్‌ పండుగ (కీస్తు పునరుద్ధరణ) పర్వదినాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆయన హాజరైయ్యారు..చర్చి ఫాథర్స్ చేసిన పార్ధనలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం ప్రతిఒక్కరూ కృషిచేసినప్పుడు మంచి సమాజం ఏర్పడుతుందన్నారు. సమాజంలో శాంతియుత వాతావరణం ఏర్పడేలా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు..ఈ కార్యక్రమంలో జడ్పి స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ, మాజీ కూడా డైరెక్టర్ ఆకుల కుమార్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సురేష్ కుమార్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సింగాపురం దయాకర్, నాయకులు తోట సత్యం, శ్రీను, యూత్ నాయకులు మారేపల్లి ప్రసాద్ బాబు, గుండె మల్లేష్, ఆకారపు అశోక్, మహిళా నాయకులు జ్యోతి, పావని, కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement