Sunday, May 19, 2024

అధైర్య పడకండి అండగా ఉంటా.. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

కాటారం : అధైర్య పడకండి.. మీకు అండగా నేనున్నానంటూ ఏఐసీసీ జాతీయ కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు భరోసా కల్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం శంకరంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నిర్వాసితుల పునరావాస కేంద్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సందర్శించారు. నిర్వాసితులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పర్యటించారు.

ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను, నిర్వాసితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భారీ వరదల వల్ల నీట మునిగిన నివాసాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట సర్పంచ్ అశోక్ కుమార్, అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement