Thursday, April 25, 2024

AP: రాజధాని పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. ఆగస్టు 23కు వాయిదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పిటిషన్లపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని పనుల పురోగతిపై ఏపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది. తాము మరో కోర్టు ధిక్కార పిటిషన్ వేశామని రైతుల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ కోర్టుకు వెల్లడించారు. ప్రభుత్వ స్టేటస్ రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై నిర్ణయం ప్రకటించాలని ఏజీ కోరారు. ఆ ఫైల్ వద్ద తమ వద్దే ఉందని.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణను ఆగస్టు 23వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement