Friday, April 26, 2024

అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్

వరంగల్ తూర్పు నియోజకవర్గం రంగశాయిపేటలో గంగపుత్రుల కోసం తెలంగాణ ప్రభుత్వం, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ చొరవతో గంగపుత్ర ఆత్మగౌరవ భవన నిర్మాణానికి 20 లక్షలు కేటాయించారు. ఈ ప్రొసీడింగ్ కాపీని నేడు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గంగపుత్ర నాయకులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు గొప్పగా ఎదుగుతున్నారని, ముదిరాజులు, గంగపుత్రులకు 400 వందల కోట్లతో చేపపిల్లల పంపిణీ చేసి 7600కోట్ల మత్య్ససంపద పెంచుకున్నామన్నారు. ప్రతి ఒక్కరు ఆత్మగౌరవంతో బతకాలని అందరికి భవనాలు నిర్మిస్తున్నామని, నేడు గంగపుత్రుల కోసం 20లక్షలతో నిర్మించనున్న ఆత్మగౌరవ భవన ప్రొసీడింగ్ అందజేసామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement