Sunday, April 28, 2024

ఆటోకు తాడుకట్టి లాగి సీపీఎం నిరసన

డీజిల్, పెట్రోల్, గ్యాస్‌ ధరలు పెంచడంపై ప్రజలు దేశవ్యాప్తంగా పలు పార్టీలు, ప్రజలు ఆందోళన బాటపట్టారు. ఆదివారం  జయశంకర్ భూపాలపల్లి  జిల్లా కేంద్రంలో సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వినూత్నమైన పద్దతిలో ఆటోకు తాడు కట్టి అపోలో ఫార్మసీ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు లాగుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తుల కొమ్ముకాస్తూ సమాన్యుల జీవితాలను బలిపెడుతుందని ఆరోపించారు. పెంచిన ధరలు తగ్గించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకు బంధు సాయిలు, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement