Saturday, April 27, 2024

ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా సీట్లకు కౌన్సెలింగ్‌.. 24న‌ వెబ్‌ఆప్షన్లు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: ఎంబీబీఎస్‌ యాజమాన్య కోటా ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మాప్‌ఆప్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రైవేట్‌ వైద్యకళాశాలల్లో యాజమాన్య కోటా ఎంబీబీఎ స్‌ సీట్లకు ఆదివారం వెబ్‌కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ మేరకు హెల్త్‌ యూనివర్సిటీ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండవవిడత కౌన్సెలింగ్‌ తర్వాత ఖాళీ అయిన సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

సీట్ల ఖాళీల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. 24న ఆదివారం సాయంత్రం 5 గంటలవరకు వెబ్‌ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే యూనివర్సిటీ విడుదలచేసిన తుది మెరిట్‌ జాబితాలో అర్హులైన అభ్యర్ధులు ఈ వెబ్‌కౌన్సెలింగ్‌కు అర్హులుగా పేర్కొన్నారు.

గత విడత కౌన్సెలింగ్‌లో సీట్‌ అలాటై జాయిన్‌ కాకపోయినా… చేరి డిస్కంటిన్యూ చేసినా.. అదేవిధంగా ఆల్‌ఇండియా కోటాలో ఇప్పటికే సీట్లు పొందిన అభ్యర్ధులు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులుగా తెలిపారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని హెల్త్‌ యూనివర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement