Saturday, April 27, 2024

తెలంగాణలో డిసెంబర్ నాటికి అందరికీ టీకాలు: మంత్రి ఎర్రబెల్లి

డిసెంబర్ చివరి నాటికి రాష్ట్ర ప్రజలందరికీ కరోనా టీకాలు వేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. శనివారం ఆయన వరంగల్‌లోని హంటర్ రోడ్, విష్ణుప్రియ గార్డెన్స్ లో సూపర్ స్ప్రెడర్స్ కోసం ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సూపర్ స్ప్రెడర్స్ కు ముందుగా టీకాలు ఇవ్వాలన్న సీఎం ఆలోచన బ్రహ్మాండమైందన్నారు. కరోనా కట్టడికి సీఎం కేసీఆర్‌ తీసుకొంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు.

సీఎం ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కరోనా టీకాలు అందరికి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ కల్లా రాష్ట్ర ప్రజలందరికి టీకాలు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం 20 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. అర్హులందరూ తప్పకుండా టీకాలు వేసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement