Thursday, May 2, 2024

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం

  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, ఇకపై ఎల్లప్పుడూ డోర్నకల్ ప్రజలకు అందుబాటులో ఉంటానని, సమస్యల సాధికారత, నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తానని డోర్నకల్ నియోజకవర్గ బాధ్యులు మాలోత్ నెహ్రు నాయక్ అన్నారు. ఆదివారం ఆయన మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో వరంగల్ లో నిర్వహించిన సంఘర్షణ సభ స్ఫూర్తి తో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్అధికారంలోకి ఖాయమని, నియోజకవర్గంలో పర్యటించి కాంగ్రెస్ ను మరింతగా బలోపేతానికి కృషి చేస్తానన్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభకు తన మాటపై వచ్చిన వేలాది రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ తరపున కార్యకర్తలు, రైతులను సంఘటితం చేసినందుకు పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి అభినందించారన్నారు. ఇకపై స్థానికంగా ఉంటూ పార్టీని గ్రామీణ స్థాయిలో బలోపేతం చేస్తానన్నారు. రాహుల్ గాంధీ కూడా జన నాయకులకే ప్రాధాన్యత ఇస్తామనటం, స్థానికంగా తనకు జనబలం ఉన్నదని తనకే డివిజన్ నుంచి అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్ సభ విజయం తెరాస మీద ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు ఒంటి కొమ్ము యుగంధర్ రెడ్డి, మాజీ జెడ్పి చైర్మన్ మెరుగు సత్యనారాయణ, మండల అధ్యక్షుడు కోట రత్నాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement