Sunday, April 28, 2024

నిరుపేదలకు అండగా సీఎం సహాయనిధి : ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

హనుమకొండ : నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి మారిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గంలోని దామెర మండలం కోగిల్వాయి గ్రామానికి చెందిన మొట్ల సుమలత, నడికూడా మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి కుమారస్వామి ఇటీవలే అనారోగ్యానికి గురికావడం జరిగింది. ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయించుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ.50 వేలు మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు చెక్కులని స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హన్మకొండలోని వారి నివాసంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ కార్యాచరణలో భాగంగానే ప్రైవేట్ హాస్పిటల్స్ కి ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ని ప్రభుత్వం తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement