Friday, May 3, 2024

WGL: కురవి ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్ లో బాలుడు అదృశ్యం…!?

కురవి, సెప్టెంబర్ 13(ప్రభ న్యూస్) : విద్యార్థి సరిగ్గా చదవడం లేదనే నెపంతో విద్యార్థిని చితకబాదడంతో బాలుడు అదృశ్యమైన సంఘటన మండల కేంద్రంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్లో బుధవారం చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసిన వివరాల ప్రకారం… మండల కేంద్రంలోని ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్లో తొర్రూర్ ప్రాంతానికి చెందిన రోషన్ అనే విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు.

రోషన్ ను సరిగ్గా చదవడం లేదనే ఉద్దేశంతో ఉపాధ్యాయులు చితకబాదడంతో బుధవారం తెల్లవారుజామున సుమారు 4గంటల సమయంలో ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల గోడదూకి అదృశ్యమయ్యాడు. విషయం తెలుసుకున్న ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం గుట్టుచప్పుడు కాకుండా విషయం బయటకు పోకుండా రహస్యంగా విద్యార్థిని వెతుకుతున్నారు. విద్యార్థి రోషన్ తొర్రూరు ప్రాంతానికి చెందిన వాడు కావడంతో అదే ప్రాంతానికి చెందిన రాజు అనే ఎం పిడబ్ల్యూ వర్కర్ సొంత ప్రాంతాల్లో వెతకడం కోసం పంపినట్లు సమాచారం. విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు. విద్యార్థి ఆచూకీ తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement