Sunday, April 28, 2024

కేంద్రం ఇచ్చిన నిధుల‌తోనే వ‌రంగల్ అభివృద్ధి – జితేంద‌ర్ రెడ్డి

వరంగల్ అర్బన్ – వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌లో బిజెపి అన్ని డివిజ‌న్ల‌లో పోటీ చేస్తున్న‌ద‌ని మాజీ ఎంపి జితేంద‌ర్ రెడ్డి తెలిపారు.. హ‌న్మ‌కొండ‌లో జ‌రిగిన కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, వ‌రంగ‌ల్ అభివృద్ధికి కేంద్ర‌మే నిధులు ఇచ్చింద‌ని వెల్ల‌డించారు.. మృత్ పథకం కింద ప్రతి వరంగల్ 420 కోట్లు ఇచ్చామ‌న్నారు. వరంగల్ స్మార్ట్ సిటీ పథకం అమలు కోసం కింద కేంద్రం 196కోట్లు ఇవ్వ‌గా, తెలంగాణ ప్రభుత్వం 40కోట్ల ఇవ్వడం జరిగింద‌న్నారు .. అలాగే రైల్వే స్టేషన్ అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం 25కోట్ల మంజూరు చేసింద‌ని గుర్తు చేశారు.. కాగా వ‌రంగ‌ల్ కు టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఏం చేసిందో చెప్పాల‌ని నిల‌దీశారు..గ్రేటర్ వరంగల్ మాస్టర్ ప్లాన్ ఏమైందో ప్రజలకు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. మడికొండ డంపింగ్ యార్డ్ లో చెత్తను కాల్చడం తో చుట్టూ ప్రక్కల ఇబ్బందులు పడుతున్నార‌ని పేర్కొన్నారు.. ఈ ఎన్నిక‌ల‌లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాల‌ని కోరారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement