Thursday, March 28, 2024

మార్కెట్ కు పోటెత్తిన వరి ధాన్యం..

దేవరకద్ర : మండల కేంద్రంలో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డుకు వరి ధాన్యం పోటెత్తింది. వివిధ గ్రామాల నుంచి రైతులు పండించిన వరి ధాన్యంను మార్కెట్ యార్డులో విక్రయించడానికి పెద్దఎత్తున తరలివచ్చారు రైతులు.కొంతమంది రైతులు ..దుకాణాల యజమానులకు.. మరికొంతమంది రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు వరిధాన్యంని విక్రయిస్తున్నారు.చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు ఈసారి వరి పంటలను బాగా పండించారు.రైతులకు వరి ధాన్యంకు సంబంధించి మద్దతు ధరలు ఇస్తామని అధికారులు తెలిపారు .రైతులకు సరైన గన్నీ బ్యాగులు కూడా ఏర్పాటు చేశామని అధికారులు చెప్పారు.మార్కెట్ మొత్తం వరి ధాన్యంతో నిండిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement