Saturday, May 4, 2024

జగజ్జివన్ రామ్ ఆశయాలను కొనసాగించాలి

బాబు జగజ్జివన్ రామ్ ఆశయాలను కొనసాగించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా తెలిపారు. మంగళవారం సింగరేణి ఇల్లెందు క్లబ్ హౌస్ నందు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి ఉత్సవాలు, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ భూపాలపల్లి జిల్లా వారిచే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగించాలని అన్నారు. భారతదేశ చరిత్రలో ఇద్దరుని మాత్రమే బాబూజీగా పిలవబడ్డారని, వారిలో మహాత్మాగాంధీ కాగా ఇంకొకరు బాబు జగ్జీవన్ రామ్ ని కలెక్టర్ గుర్తుచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement