Sunday, April 28, 2024

రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు బండి సంజయ్ కుట్ర : ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

చొప్పదండి, ఏప్రిల్ 5 (ప్రభ న్యుస్) : తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు బండి సంజయ్ తన అనుచరులతో పేపర్ లీకేజీ చేయింన బండి సంజయ్ ఒక బద్మాష్.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు బండి సంజయ్ తన అనుచరుల ద్వారా పేపర్ లీకేజీ చేయించడం దారుణం అని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. బండి సంజయ్ నీ చిల్లర రాజకీయాల కోసం విద్యార్థులు, యువతను బలి చేస్తు నీ నీచపు రాజకీయాలను చేస్తుండటం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు విద్యార్థుల జీవితాలతో బండి సంజయ్ చెలగాటం ఆడుతున్నారని ఇది ఎంతటి దుర్మార్గ‌ము ప్రజలు గమనిస్తున్నారని, ఇంతటి దుర్మార్గం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ అనుచరుడే ప్రశ్న పత్రం వాట్సాప్ ద్వారా విద్యార్థులు పరీక్ష రాస్తున్న సమయంలో పంపడం దానిని పేపర్ లీకేజీ ప్రభుత్వమే చేసిందని మాట్లాడటం దారుణం అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వెనక కూడా బండి సంజయ్ హస్తం ఉందన్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతుందన్నారు. ఏ విధంగానైనా అధికారాన్ని చేపట్టాలని ఉద్దేశంతో దురుద్దేశ పూర్వకంగా బండి సంజయ్ పనిచేస్తున్నారని, కానీ యువత, ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారన్నారు. ఇలాంటి ఎన్ని దుర్మార్గపు పనులు చేసిన ప్రజలు గమనిస్తున్నారని ఇక మీ పార్టీ కి కాలం చెప్పిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement