Friday, April 26, 2024

BREAKING : ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడి మృతి

వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని దీక్షకుంట గ్రామానికి చెందిన కాసుల సతీష్ అనే యువకుడు ప్రమాదశత్తు చేత బావిలో పడి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివ‌రాల్లోకి వెళ్తే గత నెలలో తన తండ్రి చనిపోగా తమ్ముడు గత సంవత్సరం యాక్సిడెంట్ లో చనిపోయాడు. ఇతను ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ కుటుంబ పోసిన సాగుస్తున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి 12 సమయంలో కాసుల సతీష్ ప్రమాద శాత్తు బావిలో పడి చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇతనికి ఇద్దరు పిల్లలు, ఒక భార్య ఉన్నారు. ఈయన మృతితో శోకసంద్రంలో దీక్షకుంట గ్రామస్తులు ఉండగా.. ఆ కుటుంబాన్ని ప్రజా ప్రతినిధులు, ఆపద్బాంధవులు ఆదుకోవాలని వారు కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement