Thursday, May 9, 2024

రోడ్డు ప్ర‌మాదంలో వ్య‌క్తి మృతి

ములుగు జిల్లాలో బైక్‌ను లారీ ఢీ కొట్టన ఘ‌ట‌న‌లో వ్యక్తి దుర్మరణం చెందాడు. అబ్బాపూర్ గ్రామానికి చెందిన ఆరేందుల మొగిలి (50) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. లారీ అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మొగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మొగిలి మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement