Wednesday, May 8, 2024

ప్రమాదవశాత్తు బైక్ పై నుంచి పడి వ్యక్తి మృతి

భూపాలపల్లి రూరల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండల కేంద్రంలోని సమ్మక్క సారక్క చిట్ఫండ్ యజమాని అలవాల సమ్మయ్య బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో కొత్తపల్లి గ్రామ శివారు మూల మలుపు వద్ద మరణించారు. మృతుడు సమ్మయ్య ప్రైవేట్ పాఠశాలల యజమానుల సంఘం మండల అధ్యక్షులుగా జిల్లా కార్యవర్గ సభ్యుడిగా గతంలో పని చేశారు. ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ సమ్మక్క సారక్క చిట్ఫండ్ లో పార్ట‌న‌ర్షిపు నడుపుతున్నారు. బుధవారం రోజు శ్యాంపేట మండలం కొప్పుల గ్రామంలో ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి రేగొండ మండలం కోరవటంచ గ్రామంలో మృతుడి అత్తగారు ఉండగా మామ అక్కడ దింపి భూపాలపల్లి వస్తున్న క్రమంలో భూపాలపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారు మూలమలుపు వద్ద మోటార్ సైకిల్ అదుపుతప్పి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి పోస్టుమార్టం నిమిత్తం భూపాలపల్లిలోని వంద పడక ఏరియా హాస్పిటల్ కి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement