Monday, April 29, 2024

రేపు, ఎల్లుండు ఓట‌రు న‌మోదు కోసం ప్ర‌త్యేక కేంద్రాలు ఏర్పాటు – కలెక్ట‌ర్

నిజామాబాద్ సిటీ ఆగస్టు (ప్రభ న్యూస్)25 : ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు-చేర్పులకు అవకాశం కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ ల పరిధిలో ఈ నెల 26, 27 తేదీలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బీ.ఎల్.ఓలతో పాటు ఎన్నికల అధికారులు అందుబాటులో ఉంటారని, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, ఇతర మార్పులు, చేర్పులకు సంబంధించిన నిర్ణీత నమూనా దరఖాస్తుఫారాలు వారి వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. వాటిని పూరించి బీ.ఎల్.ఓలకు అందజేయవచ్చని కలెక్టర్ సూచించారు.

ఇటీవల విడుదల చేసిన ఓటరు డ్రాఫ్ట్ రోల్ కు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలుపవచ్చని అన్నారు.ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అక్టోబర్ 04న తుది ఓటరు జాబితాను ప్రకటించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement