Friday, April 26, 2024

కరోనాకు విటమిన్‌-డీ విరుగుడు.. తెలంగాణ వైద్యుల తాజా అధ్యయనంలో వెల్లడి!

కరోనాను ఎదుర్కోవడంలో విటమిన్‌-డీ కీలకపాత్ర పోషిస్తుందని తెలంగాణ వైద్యబృందం పరిశోధనలో వెల్లడైంది. శరీరంలో విటమిన్‌-డీ సరైన మోతాదులో ఉంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చని ఆ బృందం పేర్కొంది. గాంధీ, నిమ్స్‌ దవాఖానలకు చెందిన ఈ వైద్య బృందం ఆరు నెలలపాటు శ్రమించి విటమిన్‌-డీపై అధ్యయనం పూర్తిచేసింది. పల్స్‌ డీ థెరపీ’ పేరుతో జరిపిన ఈ అధ్యయనం www.natu re.comలో ప్రచురితమైంది.

ఈ బృందం నిమ్స్‌, గాంధీ దవాఖానల్లో 130 మంది రోగులను విటమిన్‌-డీ, నాన్‌ విటమిన్‌-డీ గ్రూప్‌లుగా విభజించి పరిశోధన జరిపింది. విటమిన్‌-డీ గ్రూప్‌ వారికి వారి బీఎంఐ ఆధారంగా 8 నుంచి 10 రోజులు రోజుకు ఒక విటమిన్‌-డీ (60,000 ఐయూ) గోళీలను అందించారు. నాన్‌ విటమిన్‌ గ్రూప్‌ వారికి ఎలాంటి గోళీలు ఇవ్వలేదు. అనంతరం ఈ రెండు గ్రూపుల వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. ఎన్‌ఎల్‌ రేషియో, సీఆర్‌పీ, ఎల్‌డీహెచ్‌, ఐఎల్‌-6, ఫెరిటిన్‌, డీ-డైమర్‌ వంటి పరీక్షలను (ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్‌) ఇరు వర్గాల్లో నిర్వహించారు. విటమిన్‌-డీ అందించిన వారిలో మెరుగైన ఫలితాలు రాగా, అందించని వారిలో వ్యాధి తీవ్రత పెరిగింది. చికిత్స పొందేవారికి వరుసగా 8 రోజులు, వైరస్‌ సోకనివారు 4 రోజులు తీసుకుంటే వైరస్‌ ప్రభావం తక్కువగా ఉంటుందని వైద్య బృందం తెలిపింది. శరీరంలో విటమిన్‌-డీ 60 స్థాయిలో ఉంటే కరోనా వచ్చేందుకు 5%, 30 కంటే తక్కు వ ఉంటే 15 శాతం కంటే ఎక్కువ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. అయితే విటమిన్‌ డీ స్థాయి 60గా ఉండాలంటే ఎంత బరువున్న వారికి ఎంత డోస్‌ ఇవ్వాలన్న దానిపై గతంలో నిమ్స్‌ జరిపిన అధ్యయనం ఉపయోగపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement