Sunday, April 28, 2024

ఓట్ల కోసం ఉద్యోగాలంటూ కొత్త రాగం: సీఎం కేసీఆర్ పై విజయశాంతి ఫైర్

తెలంగాణలో 80 వేలపై చిలుకు ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు. కేసీఆర్ మ‌రోసారి నిరుద్యోగుల‌ను మోసం చేయ‌డానికి రెడి అవుతున్నారని ఆమె అన్నారు. ప్ర‌శాంత్ కిషోర్ తో క‌ల‌సి నిరుద్యోగుల‌తో స‌రికొత్త డ్రామా షూరూ చేశారని విమర్శించారు. నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ఎంత‌గానో ఎదురుచుస్తున్నారని, కేసీఆర్ స‌ర్కార్ కేవ‌లం 80వేల ఉద్యోగాల‌తో స‌రిపెట్టిందని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ గ‌తంలో 4 ల‌క్ష‌లు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయ‌ని చెప్పారని ఆమె గుర్తు చేశారు. ఇప్పుడేమో కేవ‌లం 80వేల ఉద్యోగాలంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆట‌లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగులు ఆందోళ‌నలు చేస్తుంటే చూస్తు ఊరుకున్న సీఎం సారుకి ఇప్పుడే ఉద్యోగాల భ‌ర్తీ ఎందుకు గుర్తోచిందంటే.. ముంద‌స్తూ ఎన్నిక‌ల‌కు వెల్లబోతున్నాడని వ్యాఖ్యానించారు. వారి ఓట్లు కోసం కొత్త ఉద్యోగాలంటూ కొత్త రాగం పాడుతున్నాడని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఉద్యోగాలంటూ ఆర్భాటం చేస్తున్నాడని అన్నారు. ఏడాదిన్నర క్రితం 1.91 లక్షల ఖాళీలున్నాయని బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని, ఇప్పటికి ఆ ఖాళీలు 3 లక్షలకు పెరిగాయని తెలిపారు. ఇప్పుడు ప్రకటించిన 80 వేల ఉద్యోగాలకు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని విజయశాంతి డిమాండ్ చేశారు. 18 వేల మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు. ఇలాంటి నియంత దేశంలో ఎక్కడా లేరన్నారు. ఇన్నాళ్లూ కనీసం టెట్ కూడా నిర్వహించలేదని, కేసీఆర్ కి కాషాయ సెగ త‌గిలిందన్నారు. అందుకే పెద్ద దొర‌వారు దిగి వ‌చ్చారని అన్నారు. దేశంలో బీజేపీ చేసినా అభివృద్ధిని చూసి భ‌య‌ప‌డి నక్క జిత్తుల వేషాలు వేస్తున్నాడని పేర్కొన్నారు. నాలుగు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగ‌ర‌డం త‌ట్టుకొలేక ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్ నీ నాట‌కాల‌ను ప్ర‌జ‌లు చూస్తూ ఊరుకోరు. వారే నీకు త‌గిన స‌మాధానం చెబుతారని విజయశాంతి హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement