Thursday, May 9, 2024

య‌శోద లో సీఎం కేసీఆర్ : ఆస్ప‌త్రికి మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ హైదరాబాద్ లోని సోమాజిగూడ‌ యశోద ఆస్ప‌త్రికి వైద్య పరీక్ష‌ల నిమిత్తం వెళ్లిన విష‌యం విదిత‌మే. అయితే ఇప్ప‌టికే కేసీఆర్ కు యాంజియోగ్రామ్ టెస్ట్ చేయ‌గా.. నార్మ‌ల్ గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. అయితే ఈరోజు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు కేసీఆర్ ఆస్ప‌త్రిలోనే ఉండ‌నున్నారు. అయితే స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గురికావ‌డంతో ఆయ‌న‌ను చూసేందుకు య‌శోధ‌ ఆసుప‌త్రికి తెలంగాణ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావు కూడా వెంట‌నే వెళ్లారు. మ‌రోవైపు, ఆసుప‌త్రి వ‌ద్దే ఎంపీ సంతోష్ కుమార్‌, కేసీఆర్ భార్య శోభా, కూతురు క‌విత‌, మ‌న‌వ‌డు హిమాన్ష్ కూడా ఉన్నారు. కేసీఆర్‌కు సాధార‌ణ వైద్య ప‌రీక్ష‌ల్లో భాగంగా అన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని వైద్యులు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంగానే ఉన్నార‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement