Thursday, April 25, 2024

రాధేశ్యామ్ థియేట‌ర్ వ‌ద్ద అప‌శృతి : ప్ర‌భాస్ అభిమాని మృతి

ప్ర‌భాస్ సినిమా రాధేశ్యామ్ ఈరోజు విడుద‌లైంది. అయితే రాధే శ్యామ్ సినిమా థియేట‌ర్ వ‌ద్ద ప్ర‌భాస్ అభిమాని ఫ్లెక్సీ క‌డుతూ క‌రెంట్ షాక్ కొట్ట‌డంతో మృతిచెందాడు. ఈ ఘ‌ట‌న ఏపీలోని గుంటూరులో చోటుచేసుకుంది. సాహో తర్వాత.. దాదాపు నాలుగేళ్లకు విడుదలైన సినిమా కావడంతో ప్రభాస్ అభిమానుల ఆనందోత్సాహాలకు అంతులేదు. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు, వాటికి గజమాలలు వేసి, బాణసంచా పేల్చారు. కాగా.. సినిమా విడుదల రోజే గుంటూరు జిల్లాలోని కారంపూడిలో ఐమాక్స్ థియేటర్ వద్ద అపశృతి జరిగింది. సినిమా విడుదల సందర్భంగా చల్లా కోటేశ్వరరావు (37) అనే వ్యక్తి ఫ్లెక్సీ కడుతుండగా.. అది విరిగి పక్కనే ఉన్న కరెంట్ తీగలపై పడింది. దానిని పట్టుకుని ఉన్న కోటేశ్వరరావు కరెంట్ షాక్ కు గురై.. తీవ్ర గాయాలపాలయ్యాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడగా.. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement