Sunday, May 19, 2024

మారని మందు బాబుల తీరు.. మద్యం మత్తులో ఘోరం

హైదరాబాద్ లో మందు బాబులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో మనషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మద్యం తాగి డ్రైవింగ్ చేయోద్దని పదే పదే చెప్తున్నా.. కొందరికి ఇంకా చెవికెక్కడం లేదు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై నిఘా పెంచినా మందుబాబుల ఆగడాలకు కళ్లెంపడ్డంలేదు. మద్యం మత్తులో మందు బాబులు అమాయకులను బలి తీసుకుంటున్నారు. తాజాగా మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.

మద్యం మత్తులో ఓ యువకుడు వేగంగా కారు నడిపి ఆటోను ఢీకొట్టాడు. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ప్యాసింజర్ బయటకు ఎగిరి పడి మృతి చెందాడు. ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలు అయ్యాయి. పబ్ లో‌ విధులు ముగించుకుని ఆటోలో ఇంటికి‌ వెళ్తుండగా ఉమెష్ కుమార్(37) మృతి చెందాడు. బర్త్ డే పార్టీకి హాజరై తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ కేసులో మద్యం మత్తులో కారు నడిపిన సుజిత్, ఆశిష్ ను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై 304- పార్ట్ 2 కింద కేసు నమోదు చేశారు. నిందితుడు సుజిత్ రెడ్డి శ్రుజన హైస్కూల్ వ్యవస్థాపకుడు రఘునందన్ రెడ్డి కుమారుడు. సుజిత్ రెడ్డి గోవాలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇక ఆశిష్ హెచ్‌సిఎల్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు.

ఇది కూడా చదవండి: ఎయిర్‌బ్యాగ్స్ నిబంధన అమలు వాయిదా వేసిన కేంద్రం

Advertisement

తాజా వార్తలు

Advertisement