Sunday, April 28, 2024

గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు విహెచ్ పి,భ‌జ‌రంగ్ ద‌ళ్ అన్నదానం…

బోథ్ జూలై 1 ప్రభ న్యూస్ – ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలో గ్రూప్ ఫోర్ పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు, వారి వెంట వచ్చిన పోషకులకు, తల్లిదండ్రుల విశ్వహిందూ పరిషత్,బజరంగ్ దళ్, దుర్గా కమిటీ ఆధ్వర్యంలో యువత అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక రాఘవేంద్ర జిన్నింగ్ ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటు చేసిన కేంద్రంలో అభ్యర్థులకు అన్నదానాన్ని అందిస్తున్నారు. దాదాపు రెండు వేల‌మందికి పైగా . అన్నదానం స్వీక‌రించారు.. ఆక‌లి తీర్చిన విహెచ్ పి, భ‌జ‌రంగ్ ద‌ళ్ నిర్వాహ‌కుల‌ను అభినందించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement