Thursday, May 9, 2024

హాథ్ సే హాథ్‌ జోడో యాత్ర‌కు సిద్ద‌మ‌వుతున్న ఎంపి ఉత్త‌మ్ కుమార్

హైద‌రాబాద్ – పారిశ్రామిక‌వేత్త అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్‌ కమిటీని ఏర్పాటు చేయాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ అదానీ కంపెనీలకు లాభం చేకూర్చి.. బీజేపీకి ఎలక్టోరల్‌ బాండ్ల ద్వారా లబ్ది చేకూర్చారని ఉత్తమ్ ఆరోపించారు. గాంధీభవన్‌ ప్రాంగణంలోని ప్రకాశం హాల్లో హాథ్ సే హాథ్‌ జోడో అభియాన్​పై కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఏఐసీసీ ఇంఛార్జీ మాణిక్​రావు ఠాక్రే, జోడో యాత్ర ఇంఛార్జీ గిరీష్ చోడెంకర్, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావిద్, రోహిత్ చౌదరి, చిన్నారెడ్డి తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లాల వారీగా హాథ్ సే హాథ్‌ జోడో అభియాన్ కార్యక్రమాల తీరుపై సమీక్షించారు.
అనంత‌రం ఉత్త‌మ్ మాట్లాడుతూ, భారతదేశం సెక్యులర్ దేశంగా ఉండాలని కోరుకుంటుందని కాని బీజేపీ మాత్రం దేశాన్ని మతపరంగా విభజించి రాజకీయ లబ్ది పొందుతుందని రెడ్డి మండిపడ్డారు. తాను కూడా రేవంత్ పాద‌యాత్ర‌లో పాల్గొంటాన‌ని పేర్కొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement