Sunday, April 28, 2024

అకాల వర్షం.. రైతులకు అపార నష్టం

డోంగ్లి, ఏప్రిల్ 8 (ప్రభ న్యూస్) : రాత్రి కురిసిన అకాల వర్షానికి రైతులు క‌ష్ట‌ప‌డి పండించిన పంట‌లు నిండా ముంచాయి. ఎండనక వాననక పండించిన రెక్కల కష్టం కళ్ళముందే కొట్టుకుపోయింది. డోంగ్లి మండలంలోని మాదనిపర్గా కుర్లా ఎన్బూర ఇలగం రైతులు తీవ్రంగా నష్టపోయారు. డోంగ్లి మండల కేంద్రంలో రాత్రి నుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో వరి ధాన్యం, మొక్కజొన్న తడిసి ముద్ద‌య్యాయి. అకాల వర్షంతో అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి. పంటలు భారీగా దెబ్బతిన్నాయి. అకాల వర్షంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఉరుములతో కూడిన వర్షం పడడంతో డోంగ్లి మండలంలోని వరి ధాన్యం, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement