Friday, March 29, 2024

సభాపతిని కలిసిన పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నూతనంగా నియమితులైన వీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ హైదరాబాద్ లోని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సభాపతిని సన్మానించి పుష్ప గుచ్చాన్ని అందజేశారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధిలో తెలంగాణ‌ను దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా ఉంచగలిగారని, మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలని సభాపతి సూచించారు. మంత్రి కేటీఆర్ ను, శ్రీనివాస్ గౌడ్ ను గెల్లు శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement