Saturday, April 27, 2024

TS: కులగ‌ణ‌న తీర్మానానికి అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం…

శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేడు కులగణన తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి ఏకగ్రీవంగా అన్నిపార్టీల సభ్యులు మద్దతు తెలిపారు. ఈసంద‌ర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… కులగణన తీర్మానం ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలపై సర్వే చేస్తామని తెలిపారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. వెనుకబడిన వర్గాల సమాచారాన్ని సర్వే ద్వారా సేకరిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే వివరాలను బహిర్గతం చేయలేదని వెల్లడించారు.

ఆ సమాచారాన్ని ఒక కుటుంబం తన దగ్గర దాచుకుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి అనుమానాలకు తావులేకుండా తాము కులగణన తీర్మానం ప్రవేశపెట్టామని చెప్పారు. దీనిని కూడా ప్రతిపక్షం చర్చను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు. తాను ప్రతిపక్ష నాయకులకు ఒక సలహా ఇస్తున్నాన‌ని.. దీనిపై ఎవరికి అనుమానం ఉన్నా నిర్భయంగా ప్రస్తావించొచ్చని అన్నారు… ప్రభుత్వానికి ఏవైనా సూచనలు చేయాలనుకున్నా చేయొచ్చని తెలిపారు. ప్రతిపక్షం ఇచ్చే సహేతుకమైన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వానికి సూచనలు చేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement