Tuesday, April 30, 2024

AP – రాజ‌శ్యామ‌ల యాగం – పాల్గొన్న చంద్ర‌బాబు దంప‌తులు

టీడీపీ అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని తమ నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహిస్తున్నారు. ఇవాళ తొలిరోజున చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పూజా కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. రాజశ్యామల యాగం మూడ్రోజుల పాటు జరగనుంది. ఆదివారం నాడు పూర్ణాహుతితో ముగియనుంది. ఆ క్రతువుకు పలువురు టీడీపీ నేతలు కూడా హాజరైనట్టు తెలుస్తోంది. వేదమంత్రాలతో చంద్రబాబు నివాసంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement