Saturday, May 4, 2024

TS : చెరువులో మునిగి ఇద్ద‌రు యువ‌కులు మృతి..

నిజామాబాద్ జిల్లాలో చెరువులో మునిగి ఇద్ద‌రు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న కుమ్మ‌న‌ప‌ల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. పువ్వుల కోసం చెరువులో దిగి ఇద్దరు వారి ప్రాణాల‌ను పొగొట్టుకున్నారు.

- Advertisement -

గ్రామానికి చెందిన మనోజ్‌, కుమార్ స్థానిక చెరువులో పువ్వుల కోసం చెరువులోకి దిగారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. గమనించిన స్థానికులు మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒకే రోజు ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement