Saturday, May 4, 2024

National : క‌ర్ణాట‌క‌లో బ‌స్సు బోల్తా… నలుగురు మృతి…

కర్ణాట‌క‌లో ఆదివారం తెల్ల‌వారు జామునా రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. హౌలాలకెరె టౌన్‌ సమీపంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందగా, 30మందికి తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

36 మంది ప్రయాణికులతో ఓ ప్రయివేటు బస్సు బెంగళూరు నుంచి గోకర్ణకు వెళుతుండగా ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని హెలాల కెరె ఆస్పత్రికి తరలించారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. డ్రైవర్‌ బస్సును అతివేగంగా నడపడంతోనే నియంత్రణ కొల్పోయి బోల్తా పడినట్టు చెప్పారు. మృతుల్లో ఇద్దరిని జగదీష్‌ (45), గణపతి (40)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement