Saturday, May 4, 2024

ఎస్ ఐ లుగా ఎంపికైన బొంరాస్ పేట్, దుద్యాల మండలాల యువ‌కులు

బొంరాస్ పేట్, ఆగస్ట్ 07 ( ప్రభ న్యూస్ ) : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లోని బొంరాస్ పేట్, దుద్యాల మండలాలకు చెందిన ఇద్దరు యువకులు ఎస్ ఐ పోస్టులకు ఎంపికయ్యారు.టి పి ఆర్ బి ఆదివారం సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలను విడుదల చేశారు. బొంరాస్ పేట్ మండల పరిధిలోని చౌదర్ పల్లి,గ్రామానికి చెందిన ఉదరి కిష్టయ్య కుమారుడు బందెప్ప,దుద్యాల మండల కేంద్రానికి చెందిన లక్ష్మయ్య కుమారుడు అంబుదాస్ లు ఎస్సై పోస్ట్ కు ఎంపికయ్యారు.

మధ్య తరగతి కుటుంబాలకు చెందిన ఇరు యువకులు ఎస్సై జాబ్ సాధించడం పట్ల ఆయా మండలాల ప్రజలు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement