Friday, May 3, 2024

నిజామాబాద్ జిల్లాలో సెల్ఫీ సూసైడ్ కలకలం

నిజామాబాద్ సిటీ, ఆగస్టు ప్రభ న్యూస్7: నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు ఆస్తికోసం కోసం సెల్ఫీ సూసైడ్ చేసుకున్న ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన అనిల్… ఆస్తి కోసం తీవ్ర మనస్థాపానికి గురై ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి సెల్ఫీ వీడియో తీస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్తి తగాదాల తోనే తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. అనిల్ పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement