Wednesday, May 15, 2024

Twitter Encounter – సీట్లు ఇచ్చేందుకు ఆస్తులు రాయించుకుంటున్న ‘రాబందు’ రేవంత్ రెడ్డి …కెటిఆర్ ట్విట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించే దిశగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేప‌ట్టిన‌ బస్సు యాత్ర చేపట్టిన ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కాంగ్రెస్‌పై సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను గద్దెనెక్కిన వంద రోజుల్లోనే భూస్థాపితం చేసిందంటూ హస్తం పార్టీపై ఫైరైపోయారు. మేనిఫెస్టోలో లేని హామీలను కూడా బీఆర్ఎస్ నెరవేర్చిందని గుర్తు చేశారు. కర్ణాటక చీకటి యుగంలోకి వెళ్లిపోయిందని చెప్పారు. తెలంగాణలో బస్సు యాత్ర తుస్సమనడం ఖాయమని జోస్యం చెప్పారు. నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్‌ తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే ఎవరూ నమ్మరని కేటీఆర్ అన్నారు. గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించిన నాడే తెలంగాణ కాంగ్రెస్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైందని పేర్కొన్నారు. గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో పడి మాడి మసైపోతోందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేటీఆర్ ‘ఎక్స్’లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.

కాంగ్రెస్ బస్సుయాత్ర…
తుస్సుమనడం ఖాయం…
సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ.
చీకటి పాలనకు చిరునామా కర్ణాటక.
గత పదేళ్ల కాలంలో..
గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు.

విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు.
కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీది.
మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాది.
కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా
ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు మీరు.

రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ..
తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాది.
నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి
తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరు..
కరప్షన్ కు కేరాఫ్… కాంగ్రెస్.
కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు..
ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా ??
దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను
కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరు…
ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి
అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాది.

శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్ కు
ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదు.
తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే..
వందల మంది బలిదానాలకు కారణం.

- Advertisement -

నిన్నఅయినా.. నేడు అయినా.. రేపు అయినా..
తెలంగాణకు నంబర్ వన్ విలన్ .. కాంగ్రెస్
గాంధీభవన్ ను గాడ్సేకు అప్పగించిన నాడే..
తెలంగాణ కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైంది.
ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీప్.
టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న
రాబందు… రేవంతు..
రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది.. ??
రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ మీ టెన్ జనపథ్..
మా ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉంది..
మీ గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోంది.

మూడు రోజుల పర్యటన చేసినా..
మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా…
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరు.
వైఫల్యాల కాంగ్రెస్ ను ఎప్పటికీ విశ్వసించరు..

జై తెలంగాణ
జై కేసిఆర్
జై బీఆర్ఎస్

Advertisement

తాజా వార్తలు

Advertisement