Monday, April 29, 2024

DK కు షాక్.. అక్రమాస్తుల కేసులో విచారణకే హైకోర్టు గ్రీన్ సిగ్నల్

బెంగుళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కు కర్ణాటక హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని డీకే శివకుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టు గురువారం కొట్టి వేసింది. మూడు మాసాల్లో విచారణను పూర్తి చేయాలని సీబీఐని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది.

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆస్తుల కేసులో సీబీఐ విచారణపై ఉన్న స్టే ను కర్ణాటక హైకోర్టు ఎత్తివేసింది. 2020 అక్టోబర్ 3న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను డీకే శివకుమార్ సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన కోర్టు 2023 ఫిబ్రవరి మాసంలో స్టే విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement