Sunday, April 28, 2024

TS : ఓఆర్ఆర్ పై ట‌స్క‌ర్‌ బీభ‌త్సం.. ఒక‌రు మృతి

రాజేంద్రనగర్ ఔటర్ రింగు రోడ్డు పై ట‌స్క‌ర్‌ బీభత్సం సృష్టించింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెంద‌గా..ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ సంఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది.

- Advertisement -

హిమాయత్ సాగర్ఎగ్జిట్‌17 వద్ద ఆగి ఉన్న ఓ కారును ఢీ కొట్టింది టస్కర్. ఈ తరుణంలోనే ఆ కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా… ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గోవా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టస్కర్ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇక దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement