Tuesday, April 30, 2024

TS : అద్వానంగా రోడ్డు… పట్టించుకోని అధికారులు

వికారాబాద్, మార్చి 11 (ప్రభ న్యూస్): వికారాబాద్ జిల్లా కేంద్రానికి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బురాన్ ప‌ల్లి -ధర్నారం రోడ్డు అద్వానంగా మారడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా ఈ రోడ్డు గత కొంతకాలంగా అద్వానంగా మారడంతోబురాన్‌ప‌ల్లి-ధర్మారం వెళ్లేవాసులు ఈ రోడ్డుపై ప్రయాణం చేయలేక న‌రక‌యాత‌న‌కు గుర‌వుతున్నారు.

సంబధిత కాంట్రాక్టర్ కేవలం రోడ్డు వేసి మర్చిపోవడంతో ఆయా వాహనదారులు సంబంధిత కాంట్రాక్టర్ పై మండిపడుతున్నారు. జిల్లా కేంద్రం సమీపంలోని గ్రామంలోని ఇటువంటి పరిస్థితి నెలకొని ఉండగా మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులను ఉంటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి ఈ రోడ్డును బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement